fbpx
Thursday, April 25, 2024
HomeAndhra Pradeshఏపీ కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో వర్క్ ఫ్రం హోం

ఏపీ కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో వర్క్ ఫ్రం హోం

WORK-FROM-HOME-NEW-POLICY-IN-AP

అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా నూతన ఐటీ, ఎలక్ట్రానిక్‌ పాలసీని రూపొందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా, మేటిగా రాష్ట్ర పాలసీ ఉండాలని, కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌ కోసం ఐటీ శాఖ రూపొందించిన వెబ్‌ పోర్టల్‌కు స్పందన బాగుందన్నారు. పోర్టల్‌ ప్రారంభించిన 4 రోజుల్లోనే 2,500 మంది నుంచి డిమాండ్‌ రిక్వెస్ట్ రావడం శుభ పరిణామమన్నారు.

విశాఖపట్నం కేంద్రంగా ఐటీ రంగానికి బంగారు భవిష్యత్‌ ఉందని, పలు సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తిని కనపరుస్తున్నాయన్నారు. అందుకు అనుగుణంగా విశాఖపట్నంలో మౌలిక వసతులు కల్పించడంపై దృష్టిసారించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సుమారు 2,000 ఎకరాల్లో ఏర్పాటు చేయదల్చిన బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు నాలెడ్జ్‌ పార్టనర్‌గా ప్రముఖ రసాయనాల పరిశోధనా సంస్థ సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి మేకపాటి సమక్షంలో ఏపీఐఐసీ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుతో అమూల్యమైన ఔషధాల తయారీకి ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా మారనుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular