fbpx
HomeAndhra Pradeshఏపీలో మున్సిపల్ ఎన్నికలకు క్లియరెన్స్

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు క్లియరెన్స్

HIGHCOURT-CLEARENCE-MUNICIPAL-ELECTIONS-IN-AP

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌లో మున్సిపల్‌ స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు హై కోర్టు లైన్‌ క్లియరెన్స్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చిన తరువాత వాటిని సవాల్‌ చేస్తూ దాఖలైన 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు శుక్రవారం రోజు తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ప్రకారమే ఇక ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయి, 13వ తేదీన రిజర్వ్ డే గా ఉంచారు, 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

కాగా ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. 3 గంటల అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular