అమరావతి: ఏపీలోని సెకండియర్ ఇంటర్మీడియెట్ యొక్క ఫలితాలు శుక్రవారం విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన ప్రకటించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు.
సుప్రీం సూచనల మేరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రద్దు చేశామని, కోవిడ్ నిబంధనలు పాటించి ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించినట్లు మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్ట్ల యావరేజ్కి 30 శాతం, దానితో పాటు ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రతిభకి 70 శాతం వెయిటేజ్ ను కలిపి ఫలితాలను ప్రకటించామని తెలిపారు.
అయితే దానితో పాటు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ ఐన విద్యార్థులను పాస్ చేశామని తెలిపారు. ఎవరైనా విద్యార్థులకు ఈ ఫలితాలపై ఏదైనా అసంతృప్తి ఉంటే కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహించడానికి తాము సిద్ధమని మంత్రి సురేష్ పేర్కొన్నారు. భవిష్యత్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కులను మాత్రమే ప్రకటించామని అన్నారు.
కాగా మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ఈ సందర్భంగా ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. అలాగే భవిష్యత్లో అన్ని పరిస్థితులు అనుకూలిస్తే బెటర్ మెంట్ పేరుతో మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాలను కూడా మరో వారం రోజులలోనే ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.
ఫలితాల కోసం ఈ క్రింది వెబ్ సైట్లను సందర్శించవచ్చు:
www.sakshieducation.com
www.examresults.ap.nic.in
www.results.bie.ap.gov.in
www.bie.ap.gov.in
www.results.apcfss.in