fbpx
HomeAndhra Pradeshఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

ELURU-CORPORATION-ELECTIONS-COUNTING-GETS-GREEN-SIGNAL

‌పశ్చిమ గోదావరి : ఎట్టకేలకు ఎస్‌ఈసీ కు ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ చేయడానికి కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉ.8 గంటల నుండే కౌంటింగ్‌ ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

డివిజన్ బెంచ్ తాజాగా ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించుకోవచ్చు అని అనుమతించిన వేళ ఎస్‌ఈసీ తాజాగా ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. అయితే కోవిడ్ ఇంకా పూర్తిగా తగ్గని కారణంగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

అయితే, మార్చి 10న జరిగిన ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కఊంటింగ్ ఇంకా జరగలేదు. కాగా ఈ ఎన్నికలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కోవిడ్‌ జాగ్రత్తల మధ్య 56.86% పోలింగ్ మాత్రమే నమోదైంది. కాగా ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చింది.

కాగా ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మేలో జరిగిన విచారణలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular