fbpx
HomeAndhra Pradeshఅవినీతికి పాల్పడితే ఎవ్వరినీ వదలద్దు: ఏపీ సీఎం

అవినీతికి పాల్పడితే ఎవ్వరినీ వదలద్దు: ఏపీ సీఎం

REMOVE-CORRUPTION-FROM-GRASSROOTS

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి జరగకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి చేయాలంటే అందరూ భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని చెప్పారు.

అవినీతి నిర్మూలనపై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 14400 కాల్‌ సెంటర్, కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్‌ నివేదిక, రివర్స్‌ టెండరింగ్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1902 నెంబర్‌ను కూడా ఏసీబీతో అనుసంధానం చేయాలి.

గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించాలి. వచ్చిన ఫిర్యాదులను మానిటరింగ్‌ చేసే వ్యవస్థ బలంగా ఉండాలి. 1902కు వచ్చే కాల్స్‌పై బలోపేతమైన అమలు విభాగం ఉండాలి. దీనికి కలెక్టర్‌ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలి.

దీనిపై నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లండి. 14400 నెంబర్‌పై మరింత ప్రచారం నిర్వహించండి, పర్మినెంట్‌ హోర్డింగ్స్‌ పెట్టించండి. అవినీతి కేసులలో రెడ్‌ హ్యండెడ్‌గా దొరికితే చర్యలు తీసుకోవడానికి సంవత్సరాల కాలం పట్టకూడదు. అవినీతికి పాల్పడుతూ, లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కేసుల్లో కూడా దిశ చట్టం మాదిరిగానే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా ఉండాలి.

కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోంది అంటే, అవినీతి నిరోధకత విషయంలో సీరియస్‌గా లేమనే సంకేతాలు వెళ్తాయి. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత వెంటనే చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలి. దీనికోసం అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular