fbpx
Thursday, April 25, 2024
HomeAndhra Pradeshఏపీలో వరదలపై సీఎం జగన్ సమీక్ష

ఏపీలో వరదలపై సీఎం జగన్ సమీక్ష

CM-JAGAN-REVIEWS-FLOODS-IN-AP

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కృష్ణానదిలోకి భారీగా వరద జలాలు వస్తున్న నేపథ్యంతో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోదావరి ముంపు బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉండాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు.

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో పై సీఎంఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నుంచి ప్రజలను ఖాళీ చేయించాలన్నారు.

ఎప్పటికప్పుడు పెరుగుతున్న వరదను అంచనా వేసుకుని ఆ మేరకు తగు చర్యలు చేపట్టాలన్నారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు గోదావరిలో కూడా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

అక్కడి ప్రజలకు ఆహారం, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని కూడా సీఎం స్పష్టంచేశారు. ఈమేరకు ఇరు జిల్లాల కలెక్టర్లు చురుకుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular