విశాఖపట్నం: దేశం మొత్తం మీద కరోనా వైరస్ భారీగా విజృంభిస్తోంది. ప్రజలు పిట్టల్లాగ రాలిపోతున్నారు. ఈ సందర్భంలో ఏపీలోని విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఏడాదిన్నర వయసు ఉన్న చిన్నారి ఈ కరోన మహమ్మారి బారిన పడి మృతి చెందింది.
ఈ దురదృష్టకర ఘటన మానవ హృదయాల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ చిన్నారి జ్వరం మరియు దగ్గుతో మూడు రోజుల పాటు బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించినా కూడా ఫలితం లేకపోయింది. కాగా ఆఖరి క్షణంలో చిన్నారిని కేజీహెచ్కు తీసుకురాగా అడ్మిషన్ ఇచ్చే లోగా అంబులెన్స్లోనే ప్రాణం విడిచింది. తన బిడ్డను కాపాడాలని ఆ తల్లిదండ్రులు చేసిన రోదన కేజీహెచ్ పరిసరాల్లో విషాదం నింపినట్టు అయింది.
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన వీరబాబు సీఐఎస్ఎఫ్లో పని చేస్తున్నారు. ఇతనికి ఏడాది వయసు పాప జ్ఞానిత. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పాపకు నాలుగు రోజుల క్రితం జలుబు, జ్వరం, దగ్గు వచ్చింది. స్థానిక వైద్యుల సూచన మేరకు సన్రైజర్ ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు లక్షల రూపాయలకు పైగా ఖర్చయింది. ఇంకా వ్యాధి నయం కాకపోవడంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.