fbpx
HomeAndhra Pradeshఏపీలో మాస్కు లేకపోతే రూ. 100 ఫైన్ కట్టాల్సిందే!

ఏపీలో మాస్కు లేకపోతే రూ. 100 ఫైన్ కట్టాల్సిందే!

NOMASK-100-RUPEES-FINE-IN-ANDHRAPRADESH

అమరావతి: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరైనా మాస్కు ధరించకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా విధించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం సదరు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రతి ఒక్కరు మాస్కు విధిగా ధరించాలని, ఒకరినుంచి మరొకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే ఈ నిబంధన అందరూ ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

కాగా ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న కర్ఫ్యూను మరో వారం అనగా ఈ నెల 14 వరకు పొడిగించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోవిడ్‌ నిబంధనల మేరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.

అలాగే షాపులు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు అన్నీ నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఏవైనా పబ్లిక్‌ ప్లేసుల్లో (షాపిం మాల్స్‌లో గానీ, సినిమా హాళ్లలో కానీ) సీటు మార్చి సీటు నిండేలాగ నిర్వహణ చేసుకోవచ్చు. ప్రతి మనిషికీ కనీసం 5 అడుగుల దూరం పాటీంచాలి. గోదావరి జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కోవిడ్‌ నిబంధనలు పాటించే విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular