fbpx
HomeAndhra Pradeshఏపీలో మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డు

ఏపీలో మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డు

MEDICAL-EDUCATION-RESEARCH-CORPORATION-BOARD-FORMED-IN-AP

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా 8 మంది ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలను ఇచ్చింది.

ఈ బోర్డులో సభ్యులుగా, వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ, వైద్య విధాన పరిషత్ కమిషనర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ, ఎంఎస్ఐడీసీ ఎండీ, వైద్యవిద్యా డైరెక్టర్ తదితర అధికారులుగా నియమించబడతారు. ఏపీ రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్‌ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సేవల్ని మరింత విస్తృతం చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, నర్సింగ్ కళాశాలల యొక్క అభివృద్ధి, మరియు కొత్త వైద్య విద్య కళాశాలల నిర్మాణంపై దృష్టి పెడుతుంది.

నూతన బోధనాసుపత్రుల నిర్మాణం కోసం కావాల్సిన ఆర్ధిక వనరుల సమీకరణ బాధ్యతనూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎంఈఆర్సీకి అప్పగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular