fbpx
Saturday, July 27, 2024
HomeNationalపరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సీబీఎస్ఈ బోర్డు

పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సీబీఎస్ఈ బోర్డు

CBSE-EXAM-SCHEDULE-RELEASED

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతులకు సంబందించిన పరీక్షల షెడ్యూల్‌ ను విడుదల చేసింది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ఫోక్రియాల్‌ నిషాంక్ నేడు ట్విటర్‌లో ప్రకటించారు. ఈ పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు జరగనున్నాయి.

షెడ్యూల్ ఇది:
10వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్‌ 7 వరకు జరగనున్నాయి. మార్చి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు, మే 4 నుంచి జూన్‌ 11 వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జులై 15 తేదీలోగా సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల అవుతాయి. పదో తరగతి పరీక్షలు రోజూ ఉదయం 10.30గం నుంచి మధ్యాహ్నం 1.30గం వరకు కొనసాగనున్నాయి.

కాగా, 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్‌లలో జరగనున్నాయి. తొలి షిఫ్ట్‌ ఉదయం 10.30గం నుంచి 1.30గం వరకు, రెండో షిఫ్ట్ పరీక్షలు‌ మధ్యాహ్నం 2.30గం నుంచి 5.30గం వరకు నిర్వహిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా 10, 12 తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను అనుసరించి ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఫేస్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం, పాటించడం తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ చ్బ్సె.నిచ్.ఇన్ను వీక్షించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular