హైదరాబాద్: తెలుగు రాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు డ్రగ్స్ సరాఫరా చేస్తున్న ఒక నైజీరియన్తో పాటు మరో 12 మందిని అరెస్ట్ చేశారు.
వారితో పాటుగా డ్రగ్స్ సేవిస్తున్న 11 మంది వ్యక్తులని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి నుంచి ఎమ్డీఎమ్ఏ, ఎల్ఎస్డీ బ్లాట్లతో పాటు గంజాయి, హ్యాష్ ఆయిల్ను కూడా పోలీసూలు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఎస్ఆర్ నగర్, కార్ఖానా, సికింద్రాబాద్లో ముఠాగా ఏర్పడి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలో కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు.