ధర్మశాల: సీనియర్ బౌలర్లు లేకుండ బరిలోకి దిగిన భారత్ ప్రత్యర్థిని ఆరంభంలోనే మూడు చెరువుల నీళ్ళు తాగించింది. అవేశ్ ఖాన్ (2/23), సిరాజ్ (1/22), హర్షల్ (1/29)ల దెబ్బకు శ్రీలంక బ్యాటింగ్ లైనప్ కుదేలయింది. కెప్టెన్ షనక మాత్రమే (38 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) కూలిపోతున్న లంకను ఒంటిచేత్తో నిలబెట్టీ గౌరవప్రదమైన సాధించేలా చూశాడు.
భారత బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 73 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) మూడవ టీ20లో హాఫ్ సెంచారీ చేసి వరుసగా మూడు టీ20ల్లో హాఫ్ సెంచరీ చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 5 వికెట్లకు కేవలం 146 పరుగులు మాత్రమే చేసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి మ్యాచ్ తో పాటు సిరీస్ అజేయంగా గెలిచింది. శ్రేయస్ అయ్యర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.