fbpx
HomeBusinessకరోనా వల్ల బంగారం ధరలు పెరిగే అవకాశం!

కరోనా వల్ల బంగారం ధరలు పెరిగే అవకాశం!

GOLD-PRICES-MAY-INCREASE-IF-LOCKDOWN-COMES

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెగ మళ్ళీ పెరుగుతూ అందరినీ కలవర పెడుతోంది. ఈ కరోనా సెగ వల్ల రానున్న రోజుల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ మరోసారి కరోనా విజృంభిస్తే దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు, కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాట్లు చేసే అవకాశం లేక పోలేదు. అయితే ఇప్పటికే మహారాష్ట్రలో పలు చోట్ల కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు కూడా చేస్తున్నారు.

అలాంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు తమ షేర్లను అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇలా వారి చేతిలో ఉన్న నగదును బంగారం మీద కొద్ది కాలానికి పెట్టుబడి పెట్టె అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని వల్ల బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఒకవేళ లాక్‌డౌన్ పరిస్థితి రాకుంటే, త్వరలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగి అలా కూడా ధరలు పెరిగే అవకాశం చాలా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధరలు 3 రోజుల నుంచి స్థిరంగా ఉన్నాయి. నేడు నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.42,010 ఉంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,830గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular