fbpx
HomeAndhra Pradeshతూర్పుగోదావరి జిల్లాలో రేపు 24 గంటల కర్ఫ్యూ

తూర్పుగోదావరి జిల్లాలో రేపు 24 గంటల కర్ఫ్యూ

EAST-GODAVARI-24HRS-CURFEW

తూర్పుగోదావరి: జిల్లోలో క‌రోనా కేసులు అధికంగా పెరుగుతున్న నేప‌థ్యంలో 24 గంట‌ల పాటు జిల్లా వ్యాప్తంగా క‌ర్ఫ్యూ అమ‌లుకు క‌లెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేపు(ఆదివారం) ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు తెలిపారు.

కేవలం మెడిక‌ల్ షాపుల‌కు, అత్య‌వ‌స‌ర వైద్య‌సేవ‌లుకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంద‌ని, మిగ‌తా అన్ని సేవ‌లను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఎవ‌రైనా రోడ్ల మీద తిరిగితే వారిపై ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 14 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడినట్లు సమాచారం.

బొమ్మూరు స్టేషన్ ప‌రిధిలో పని చేసే ఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు స‌హా నలుగురు కానిస్టేబుళ్లు, ధవళేశ్వరం స్టేషన్ ప‌రిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లు, క‌డియం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ కానిస్టేబుల్‌కి క‌రోనా నిర్ధార‌ణ అయిన‌ట్లు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు.

వీరిలో కొంద‌రు హోం క్వారంటైన్‌లో ఉండగా, మ‌రికొంద‌రిని బొమ్మూరు క్వారంటైన్‌ సెంటర్ కి త‌ర‌లించారు. చింతూరు ఐటీడీఏ పీవో కార్యాలయంలో ఇద్దరికి కరోనా సోకింది. రేఖపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారికీ కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular