fbpx
HomeAndhra Pradeshమూడు రాజధానులు అభివృద్ధికి ఆటంకం: శైలజానాథ్

మూడు రాజధానులు అభివృద్ధికి ఆటంకం: శైలజానాథ్

ap-three-capitals-bill-governor

అమరావతి: ఎప్పుడూ హాట్ టాపిక్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిని ఆంధ్ర ప్రదేశ్ లో మరో అంశం వేడి పుట్టిస్తోంది. అది మూడు రాజధానుల విషయం. ఏపీ ప్రభుత్వం తలబెట్టిన మూడు రాజధానుల అంశం కీలక దశలో ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ చెంతకు ఈరోజు పంపింది. దీని వల్ల ఇప్పుడు రాజకీయాలు వేడెక్కాయి.

ఈ నేపథ్యంలో రాష్త్ర మాజీ ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్ గవర్నర్ బిశ్వభూషన్ కు లేఖ రాశారు. మూడు రాజధానుల బిల్లును తిరస్కరించాలని ఆయన తన లేఖలో కోరారు.

కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మూడు రాజధానులకు వ్యతిరేకం అని ఆయన తెలియజేశారు. మూడు రాజధానులు అభివృద్ధికి ఆటంకం అని ఆయన పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అన్నారు.

వీటిని దృష్టి లో ఉంచుకొని మీరు ఈ మూడు రాజధానుల బిల్లును తిరస్కరించాలని ఆయన కోరారు. మరి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ విషయంలో స్పందిస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular