fbpx
HomeAndhra Pradeshఏపీ గవర్నర్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి!

ఏపీ గవర్నర్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి!

CM-JAGAN-MEETS-GOVERNOR-AND-ENQUIRES-HIS-HEALTH-STATUS

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరియు అతని భార్య వైఎస్ భారతి పరామర్శించారు. ఈ రోజు సాయంత్రం రాజ్ భవన్‌కు చేరుకున్న సీఎం కు గవర్నర్ మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు.

కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న గవర్నర్‌ దంపతులు, హైదరాబాద్‌లో చికిత్స అనంతరం విజయవాడకు తిరిగి వచ్చారు. ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్‌ దంపతులు, గవర్నర్‌ దంపతులను కలిసి వారిని పరామర్శించి, వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

గవర్నర్ విశ్వభూషణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని అన్నారు. మరి కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు సూచించారు. శాసన మండలి సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, విజయవాడ నగర పోలీస్ కమషనర్ కాంతి రాణా టాటా, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యం, రాజ్ భవన్ ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular