చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న జట్టు. యూఏఈ లో జరిగే ఐపీఎల్ 13వ సీజన్కు అందరికంటే ముందుగా చెన్నై జట్టు సమాయత్తమవుతుంది. అందుకు సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ను ఆగస్టు మొదటి వారంలోనే మొదలుపెట్టనుంది.
ఆగస్టు 10వ తేదీన యూఏఈకి వెళ్లేందుకు చెన్నై సూపర్కింగ్స్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ ఆటగాళ్లకు తెలియజేసింది. అయితే చెన్నై జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ ముందుగా చెన్నైకు వచ్చి రిపోర్ట్ చేయనున్నట్లు సీఎస్కే యాజమాన్యం తెలిపింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ప్రత్యేక చార్టర్ విమానంలో ఆటగాళ్లను దుబాయ్కు పంపనున్నట్లు తెలిపింది.
చెన్నై సూపర్కింగ్స్ జట్టు కరోనా వైరస్కు ముందు ఐపీఎల్లో పాల్గొనేందుకు అందరికంటే ముందుగానే ట్రైనింగ్ క్యాంప్ను ప్రారంభించింది. జట్టులో సీనియర్ ఆటగాళ్లైనా సురేశ్ రైనా, ఎంఎస్ ధోని , అంబటి రాయుడు తమ ప్రాక్టీస్ను కూడా ప్రారంభించారు. కాగా కరోనా వైరస్ విజృంభించడంతో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కాస్త వాయిదా పడింది.
ఒకానొక దశలో అసలు ఐపీఎల్ జరగుతుందా అన్న అనుమానం కూడా కలిగింది. కానీ టీ20 ప్రపంచకప్ వాయిదా పడడంతో ఐపీఎల్కు అడ్డంకులు తొలిగిపొయాయి. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించారు. ఐపీఎల్ 13వ సీజన్ 53 రోజుల పాటు జరగనుంది, సీజన్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10వ తేదీన జరగనుంది.