fbpx
Thursday, April 25, 2024
HomeAndhra Pradeshఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఆదేశాలు!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఆదేశాలు!

AP-GOVERNMENT-PENDING-DA-CLEARANCE-ORDERS-ISSUE

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. బకాయీలు ఉన్న డీఏ విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను ఇవాళ జారీ చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు ఈ‌ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయంతో 2019, జూలై 1వ తేదీ నుంచి ఉద్యోగులకు ఈ నూతన డీఏ వర్తించనుంది.

ఈ నిర్ణయం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఏడాది అనగా జనవరి 2022 నుండి తమ జీతంతో ఈ నూతన డీఏమ్ను తీసుకోనున్నారు. ఇప్పటికే ఉన్న డీఏ బకాయిలను 2022 జనవరి నెల నుండి మూడు విడతలుగా చెల్లిస్తామని ఉత్తర్వులలో పేర్కొంది.

కాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ డీఏ ఉత్తర్వులు జారీ చేసినాందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని ఆ సంఘ చైర్మన్‌ కే వెంకట రామిరెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular