fbpx
Friday, April 26, 2024
HomeAndhra Pradeshశ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్న సీఎం జగన్

శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్న సీఎం జగన్

AP-CM-SRISAILAM-PROGRAM-CANCELLED

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ తన శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్లుగా శనివారం సీఎంఓ అధికారులు వెల్లడించారు. శ్రీశైలంలోకి వరుసగా రెండో ఏడాది వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ (శుక్రవారం) ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జల విద్యుత్‌ కేంద్రంలో చిక్కుకుపోయిన 9 మందిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని సీఎంకు వివరించారు.

ఈ పరిస్థితుల్లో సీఎం శ్రీశైలంకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని ముఖ్యమంత్రి అధికారులతో అభిప్రాయ పడ్డారు. తెలంగాణ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు.

ఏపీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని సీఎం అత్యవసర ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం పర్యటనను కూడా రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవ్వాల్టి సీఎం శ్రీశైలం పర్యటనను రద్దుచేస్తున్నట్టుగా సీఎం అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular