fbpx
HomeNationalరైల్వే శాఖ పై కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం?

రైల్వే శాఖ పై కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం?

CENTRAL-GOVERNMENT-TO-SELL-RAILWAY-SHARES

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖపై కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్ (ఐఆర్‌సీటీసీ) లోని తన వాటాల్లో కొంత షేర్ల భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించాలని(అమ్మకం) ఆలోచిస్తోందని సమాచారం.

ఈ నేపథ్యంలో పెట్టబడలకు సంబంధించిన సంస్థ (డీఐపీఏఎం) అమ్మకాల ప్రక్రియను నిర్వహించడానికి సెప్టెంబర్ 10 లోగా సెబీలో నమోదు చేసుకున్న మర్చంట్ బ్యాంకర్ల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. కాగా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబి) నియమ నిబంధనలకు అనుగుణంగానే షేర్ల అమ్మాకలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు రెల్వే శాఖలో పనిచేసే ఉద్యుగలకు అర్హత ఉంటే షేర్లలో వాళ్ళకు డిస్కౌంట్లు కూడా ప్రకటించే అవకాశాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అమ్మకం ప్రక్రియపై మర్చెంట్‌ బ్యాంకర్లు అధ్యయనం చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

కాగా ఈ సంస్థ మూలధనం రూ.250 కోట్లు కాగా, పెయిడ్ అప్ క్యాపిటల్ రూ .160 కోట్లు. ప్రస్తుతం రైల్వే శాఖ షేర్ క్యాపిటల్‌లో 87.40 శాతం వాటాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బీఎస్‌ఇ లో(బాంబే స్టాక్‌ ఎక్స్చెంజ్‌) ఐఆర్‌సీటీసీ షేర్లు రూ 1,351.65 వద్ద ట్రేడీంగ్ జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular