fbpx
HomeAndhra Pradeshఅమ్మ ఒడి పథకంపై క్లారిటీ ఇచ్చిన ఆదిమూలపు సురేష్

అమ్మ ఒడి పథకంపై క్లారిటీ ఇచ్చిన ఆదిమూలపు సురేష్

AP-CLARIFY-AMMAVODI-SCHEME-AMID-ELECTIONS

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండొ విడత అమ్మఒడి పథకం యధాతథంగా అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరణ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే అమ్మవొడికి సంబందించి జీవో నంబర్‌ 3 విడుదల చేశామని, 44,08,921 మందికి అమ్మఒడి వర్తింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సంవత్సరం రూ.6,161 కోట్లతో అమ్మఒడి పథకం అమలు చేయనున్నామని తెలిపారు. బడులకు పిల్లలను పంపించి అర్హత ఉన్న తల్లుల ఖాతాల్లో సోమవారం అమ్మఒడి నగదును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేస్తారని మంత్రి పేర్కొన్నారు. ఆయా జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరును మంత్రి సురేష్‌ తప్పుబట్టారు. న్యాయవ్యవస్థ ఇస్తున్న సూచనలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పాటించడం లేదు అని అన్నారు. ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఎవరి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారో నిమ్మగడ్డకు మాత్రమే తెలుసని ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular