హైదరాబాద్: ప్రపంచ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ కంపెనీ, భారత్ లో భారీ ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్లో పెడుతోంది. తాజాగా అమేజాన్ అమెరికా వెలుపల తన సొంత తొలి క్యాంపస్ని హైదరాబాద్లో నిర్మిస్తోంది. హైదరాబాద్ లో 2015లోనే మొదలైన ఈ భారీ నిర్మాణం ప్రస్తుతం ఆఖరు దశకు చేరుకుంది.
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అమెజాన్ నిర్మిస్తున్న ఈ భారీ క్యాంపస్లో పని చేసే ఉద్యోగులకు సకల సౌకర్యాలను కల్పిస్తోంది. ఏకంగా 18 లక్షల చదరపు అడుగుల సామర్థ్యం కలిగిన ఈ భవనంలో ఒకే సారి 15 వేల మంది ఉద్యోగులు పని చేయడానికి వీలు కల్పించింది కంపెనీ.
ఈ భవనం లో ఉన్న క్యాంటీన్లో ఒకేసారి 2700 మంది భోజనం చేయగల సామర్థ్యంతో నిర్మిస్తోం ది అమేజాన్. అంతే కాక ఈ భవనంలో 49 హైస్పీడ్ లిఫ్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఫ్లోర్ ను ఒక థీమ్ బేస్డ్గా అందంగా తీర్చిదిద్దారు.