fbpx
HomeMovie Newsమరో పాన్ ఇండియా సినిమాతో డార్లింగ్

మరో పాన్ ఇండియా సినిమాతో డార్లింగ్

Prabhas NewPanIndiaMovie Aadipurush

టాలీవుడ్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాల్ని ప్రకటిస్తూ మంచి జోరులో ఉన్నాడు. మామూలుగా ప్రభాస్ సినిమాలు 2-3 సంవత్సరాలకొకటి వస్తుంది. కానీ ప్రస్తుతం ప్రభాస్ సంవత్సరానికొకటి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం ప్రభాస్ తన తర్వాతి సినిమా ప్రకటించారు. ఓం రౌత్ డైరెక్షన్ లో ‘ఆది పురుష్’ అనే సినిమాని ప్రకటించారు. అలాగే ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు. పోస్టర్ లో పురాణాలకి సంబందించిన వివిధ వేషధారణలు చూస్తుంటే ఎదో గొప్ప కథని చెప్పే ప్రయత్నం లాగ అనిపిస్తుంది. కానీ పోస్టర్ కి సినిమాకి చాలా తేడాలు ఉంటాయని ఇది వారికి చాల సినిమాలు రుజువు చేశాయి. ప్రభాస్ 22 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాని గుల్షన్ కుమార్ మరియు టి-సిరీస్ సమర్పిస్తుండగా భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

చెడు పైన మంచి సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుందాం అనే థీమ్ తో ఈ సినిమా రాబోతోందని ప్రకటించారు. ఈ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉందని, ఇందులోని ప్రతీ క్యారెక్టర్ ప్రత్యేకమే అలాగే ఇలాంటి క్యారెక్టర్ తాను చేయడం ఒక బాధ్యత అలాగే గర్వం గా కూడా ఉంటుంది. డైరెక్టర్ ఓం డిజైన్ చేసిన హీరో క్యారెక్టర్ తప్పకుండా అందరికి నచ్చుతుంది ఎప్పటిలాగే దేశం అంత ఈ సినిమా పైన తమ ప్రేమ కురిపిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పారు.

ప్రస్తుతం ప్రభాస్ ‘రాధా కృష్ణ’ డైరెక్షన్ లో ‘రాధే శ్యామ్‘ చేస్తున్నారు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇది ముగించి డిసెంబర్ నుండి నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే మంచి ప్లానింగ్ తో ప్రభాస్ రెండు సినిమాల్ని ఒకే సారి షూటింగ్ చేసి 2022 లో రెండు సినిమాల్ని విడుదలకి సిద్ధం చేసే పని లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక రకంగా చూస్తే పెద్ద హీరోలు ఇలా వరుస పెట్టి సినిమాలు చేయడం ఇండస్ట్రీ కి మంచి పరిణామం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular