fbpx
HomeTelanganaసూర్యాపేటలో ఒకే ఇంట్లో 22 మందికి కరోనా

సూర్యాపేటలో ఒకే ఇంట్లో 22 మందికి కరోనా

22-MEMBERS-TESTED-POSITIVE-IN-ONE-FAMILY

సూర్యాపేట : తెలంగాణలో ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపింది. ఇటీవల ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన పుట్టిస్తోంది. వారు ఒక సమీప బంధువు అంత్యక్రియలకు హాజరైన క్రమంలో కరోనా వైరస్‌ సోకింది.

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి మరణించారు. దీంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్‌షిప్‌కు చెందిన మృతుడి బంధువులు అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. తరువాత వీరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు తలెత్తగా పరీక్ష చేయించుకోవడంతో కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఇదే క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు వారి కుటుంబ సభ్యులు అందరికీ పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా తేలిందని డీఎంహెచ్‌ఓ హర్షవర్ధన్‌ తెలిపారు. బాధితుల్లో ఎవరికి లక్షణాలేవీ కనిపించక పోయినా పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యాదాద్రి టౌన్‌ షిప్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటిని సర్వే చేస్తున్నారు. బాధితులంతా స్వీయ నిర్భందంలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular