fbpx
HomeAndhra Pradeshజెడ్పీటీసీ, ఎంపీటీసీ ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

ZPTC-MPTC-ELECTIONS-RELEASED-IN-AP

అమరావతి: ఏపీలో ఎన్నికల ఫీవర్ ఇంకా పూర్తి కాలెదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 8న‌ నిర్వహించబోతున్నారు. 10వ తేదీన వీటి ఫలితాలు కూడా ప్రకటిస్తారు.

కాగా ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఎక్కడైన ఏదైనా అవాంచనీయ సంఘటనలు జరిగి ఎన్నిక రద్దైతే రీపోలింగ్‌ 9వ తేదీన నిర్వహించనున్నారు. 2020 మార్చి 14న ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే నిలిచిందో అక్కది నుండే ప్రక్రియ మొదలు కానుంది.

కాగా రాష్ట్రంలో 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular