fbpx
HomeAndhra Pradeshతొలి విడత ఎన్నికకు విశాఖ జిల్లా సంపూర్ణ సమాయత్తం

తొలి విడత ఎన్నికకు విశాఖ జిల్లా సంపూర్ణ సమాయత్తం

VIZAG-READY-FIRST-PHASE-ELECTIONS

విశాఖ: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగు విడతల్లో జరగున్న సంగతి తెలిసిన విషయమే. కాగా విశాఖ జిల్లాలో తొలి విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినయ్‌ చంద్ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించి మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందులో తొలి విడతగా అనకాపల్లి డివిజన్‌లోని 344 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ తొలి విడతలో జిల్లా మొత్తం మీద 9608 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు, అందుకు కావాల్సిన 8122 బ్యాలెట్ బాక్స్‌లను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా అనకాపల్లి డివిజన్ లో మొత్తం 240 సమస్యాత్మక ఎన్నికల కేంద్రాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29 నుంచి 31 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు.

దినితో పాటు విశాఖ జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి తాను కూడా పాల్గొన్నానని వివరించారు. అలాగే ప్రభుత్వం ఏకగ్రీవాలకు నజరానాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో చాలా చోట్ల ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular