fbpx
HomeMovie Newsసినిమా రంగంలో అత్యున్నత గౌరవం పొందిన రజిని

సినిమా రంగంలో అత్యున్నత గౌరవం పొందిన రజిని

SuperStarRajinikanth AwardedWith DadaSaheb

న్యూ ఢిల్లీ: సూపర్ స్టార్ బిరుదుతో కేవలం తమిళ్ మరియు సౌత్ లోనే కాకుండా దేశం మొత్తం అలాగే ఏషియా లోని కొన్ని దేశాల్లో కొన్ని దశాబ్దాలుగా ఫ్యాన్ బేస్ ఉన్న హీరో రజిని కాంత్. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రజినికాంత్ కి దాదా సాహెబ్ అవార్డు ని ఇస్తున్నట్టు ప్రకటించారు. సినిమా రంగంలో భారత దేశంలో ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ అవార్డు అని చెప్తుంటారు. ఈ రోజు రజినీకాంత్ ని ఈ అవార్డు వరించింది. ఈ రోజు 51 వ దాదా సాహెబ్ అవార్డుల్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.

ఈ అవార్డు గ్రహీతల్లో తెలుగు, తమిళ్ నుండి అక్కినేని నాగేశ్వర్ రావు, ఎల్.వి.ప్రసాద్, దగ్గుబాటి రామానాయుడు, కే.విశ్వనాధ్, శివాజీ గణేశన్, బాల చందర్ అలాగే పోయిన సంవత్సరం బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు లని స్వీకరించారు. ఈ సంవత్సరం రజినీకాంత్ ఈ అవార్డు ని పొంది ఈ లెజెండ్స్ చెంత చేరారు. ఈ అవార్డు పొందినందుకు దేశం లోని ప్రముఖులందరి నుండి రజినీకాంత్ కి అభినందనల వెల్లువ మొదలయింది. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular