fbpx
HomeAndhra Pradeshబీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఏపీ సీఎం జగన్ తో భేటీ

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఏపీ సీఎం జగన్ తో భేటీ

SUBRAMANYASWAMY-MET-CM-JAGANMOHAN-IN-TADEPALLI

తాడేపల్లి : తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అబద్ధపు కథనాల వెనక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నిందించారు. సొంత లాభం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని ఆయన అన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయన్నారు.

ఈ విషయమై తాను ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేశానన్నారు. ఒక కేసు విషయంలో ఈ రోజు ఏపీకి వచ్చిన ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించి, శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది.

వారిరువురి భేటీ తరువాత ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ లావాదేవీలను కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయించేందుకు సీఎం జగన్‌ అంగీకరించారని ఆయన తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో మంచి సంబంధాలు ఉండేవని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం జగన్‌ చర్చలు జరుపుతారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రధానికి సీఎం జగన్ రెండు సార్లు లేఖ రాశారని కూడా ఆయన గుర్తుచేశారు. అఖిల పక్షం, కార్మిక నేతలతో కలుస్తానని సీఎం చెప్పారన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తాను విభేదిస్తున్నానని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular