fbpx
HomeNationalస్మగ్లర్‌ కిషన్‌ సింగ్‌ భారత్‌కు అప్పగించిన బ్రిటన్

స్మగ్లర్‌ కిషన్‌ సింగ్‌ భారత్‌కు అప్పగించిన బ్రిటన్

SMUGGLER-KISHAN-HANDOVERED-TO-INDIA-BY-BRITAIN

లండన్‌: భారత్ కు చెందిన పేరుమోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్‌ కిషన్‌ సింగ్‌ను(38) బ్రిటన్‌ ప్రభుత్వం స్వదేశానికి‌ అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కిషన్‌ సింగ్‌ భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌ నేరగాడిగా పోలీసు రికార్డులకెక్కాడు.

లండన్ యొక్క‌ మెట్రోపాలిటన్‌ పోలీసు శాఖ కిషన్ ని ఇండియాకు అప్పగించింది. రాజస్తానీ మూలాలున్న కిషన్‌ సింగ్‌ బ్రిటీష్‌ పౌరుడు. 2016–17లో ఇండియాలో మెఫాడ్రోన్‌ (వైట్‌ మ్యాజిక్‌), మ్యావ్‌ మ్యావ్, కెటామైన్‌ అనే మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేసినట్లు అతడిపై కేసు నమోదయ్యింది. 2018లో లండన్‌లో అక్కడి పోలీసులు కిషన్‌ సింగ్‌ను అరెస్టు చేశారు.

కాగా రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా రేవంత్ గ్రామం కిషన్‌ సింగ్‌ జన్మస్థలం. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో అతడు 2009 లో లండన్ వెళ్లి అక్కడ విండో-తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కిషన్ 2013 లో భారతదేశానికి వచ్చి రాజస్థాన్‌లో వివాహం చేసుకుని మళ్లీ తిరిగి లండన్‌కు వెళ్లాడు.

అక్కడే ఆరేళ్లపాటు ఉన్న తరువాత కిషన్ సింగ్ 2015 లో యునైటెడ్ కింగ్‌డమ్ పౌరసత్వం పొందాడు. 2016 నుంచి అతడి చీకటి వ్యాపారాలు బయటపడ్డాయి. ముంబైలోని ఏజెంట్ల ద్వారా మహారాష్ట్ర నుంచి మత్తు పదార్థాలను సరఫరా చేసినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.

ఢిల్లీలోనూ ఏజెంట్లను నియమించుకుని యూఏఈ, యూకే, యూఎస్‌ఏ, మలేసియా, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో డ్రగ్స్‌ దందా సాగించినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా 2017, ఫిబ్రవరి 15న ముగ్గురు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular