fbpx
HomeBusinessఆర్థిక సర్వే, బడ్గెట్ నేపథ్యంలో తీవ్ర ఊగిసలాట

ఆర్థిక సర్వే, బడ్గెట్ నేపథ్యంలో తీవ్ర ఊగిసలాట

ముంబై : ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు, మరియు రానున్న బడ్జెట్‌ అంచనాల మధ్య దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్‌ మొదటి నుంచే లాభాలతో సూచీలు ఫిబ్రవరి సిరీస్‌ను ఉత్సాహంతో ప్రారంభించాయి. కాగా 400 పాయింట్లకు పైగా ఎగిసి 5 రోజుల వరుస నష్టాలకు చెక్‌ చెప్పాయి.

అయితే దాని తరువాత తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ సెన్సెక్స్ ఒక్కసారిగా 600 పాయింట్లకు పైగా కుప్పకూలింది. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ చివరకు సెన్సెక్స్‌ 589 పాయింట్లు పతనమై 46285 వద్ద 46 వేల 300 స్థాయి దిగువకు చేరింది.

మరో వైపు నిఫ్టీకి కూడా అదే పరిస్థితి లో నిలిచింది. 183 పాయింట్ల నష్టంతో 13634 వద్ద నిఫ్టీ ముగిసింది. మరోవైపు బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్‌‌ షేర్లలో కొనుగోళ్ళ మద్దతు కనిపించింది.

టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్‌ , బీపీసీఎల్‌ లాభపడగా, రిలయన్స్‌, బ్రిటానియా, మారుతీ సుజుకీ, ఐటీసీ, హీరో మోటో, ఇన్ఫోసిస్, టీసీఎస్‌, డా. రెడ్డీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ , భారతి ఎయిర్‌టెల్‌ నష్టపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular