fbpx
HomeTelanganaతెలంగాణలో సెకండ్ వేవ్ రావొచ్చు, జాగ్రత్త: కేసీఆర్

తెలంగాణలో సెకండ్ వేవ్ రావొచ్చు, జాగ్రత్త: కేసీఆర్

SECOND-WAVE-MAY-HIT-TELANGANA

హైదరాబాద్ : తెలంగాణ లో మరోసారి కరోనా మహమ్మారి విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని, అధికార యంత్రాంగం అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలు కూడా తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

‘ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు మళ్ళీ ఎక్కువగా పెరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ పెరుగుదల కొద్దిగా కనిపిస్తోంది. దీంతో పాటు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ వచ్చినా సరే తట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయాలి’అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

కోవిడ్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా, సెకండ్‌ వేవ్‌ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు.

ముఖ్యంగా ప్రజలు తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడమే అసలైన మందు అని సూచించారు. కోవిడ్‌ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేయాల్సినంత పని చేస్తుంది, అయితే దీనికి ప్రజల సహకారం కూడా అవసరం. అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండడమే అసలైన మందు అని తెలిపారు. తప్పకుండా మాస్క్‌ ధరించాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి అని సీఎం సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular