fbpx
Saturday, July 27, 2024
HomeTelanganaతెలంగాణలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా!

తెలంగాణలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా!

POSITIVE-CASES-SURGING-IN-TELANGANA-AGAIN

కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ప్రజలు రక్షణ లేకుండా విచ్చలవిడిగా తిరగడం, సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకుండా బయటకు రావడమే ఇప్పుడు కొత్త కేసుల పెరుగుదలకు కారణమని వైద్యులు అంటున్నారు.

కాగా గడచిన 15 రోజుల నుండి కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో రోజూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 100 కేసుల మేర నమోదైనట్లు సమాచారం. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కేసుల వివరాలు తెలుస్తుండగా, ప్రైవేట్‌లో చేరే వారి సంఖ్య బయటకు పొక్కడం లేదు.

అధికంగా వారాంతపు సంతలు, షాపింగ్‌ మాళ్లు, సినిమా హాళ్లు, శుభకార్యాల్లో ప్రజలు భారీగా హాజరవుతుండడమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మార్చి 13 తేదీన మూసాపేట, కూకట్‌పల్లి యూపీహెచ్‌సీ సెంటర్‌లో 15 కేసులు నమోదు కాగా, 14న మూసాపేటలో 6 నమోదయ్యాయి.

అదే విధంగా సోమవారం 15న కూకట్‌పల్లి, మూసాపేటలో కలిపి 15 కేసులు నమోదయ్యాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి రోజూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కూకట్‌పల్లి ప్రాంతంలో రెండోసారి కరోనా వచ్చిన వారి సంఖ్య కూడా పదుల సంఖ్యలోనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular