fbpx
HomeBusinessపెట్రోల్, డిజిల్ లను జీఎస్టీలోకి తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదు!

పెట్రోల్, డిజిల్ లను జీఎస్టీలోకి తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదు!

PETROL-DIESEL-PRICES-REDUCTION-NOT-IN-CENTRAL-CARDS

న్యూఢిల్లీ: అలుపు లేకుండా రోజురోజుకు పరుగులు పెడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ మరియు గ్యాస్‌ ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఇన్నాళ్ళు అందరూ భావిస్తుండగా అలాంటి ఉద్దేశ్యం లేదని ప్రజల ఆశలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పారు.

రిజర్వ్‌ బ్యాంక్‌, ప్రతిపక్షాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించేందుకు ఇస్తున్న సలహాను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకునేలా లేదు. దీనితో ఆగకుండా ఇప్పుడు కొత్తగా బీమా రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేసే చర్యలను కార్యరూపం దాల్చారు. పార్లమెంట్‌లో సోమవారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సమాధానం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌, జెట్‌ ఫ్యూయల్‌, సహజ వాయువులను జీఎస్టీ మండలి పరిధిలోకి తెచ్చే అంశం పరిశీలనలో లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. 2017 జూలై 1వ తేదీన వచ్చిన జీఎస్టీలో పెట్రోలియం ఉత్పత్తులను చేరిస్తే ధరలు తగ్గుతాయని అందరూ చెబుతునే ఉన్నారు. అయినా కూడా కేంద్రం పెడచెవిన పెట్టేసింది.

ఇదిలా ఉండగా ఇటీవల కేంద్రమంత్రి చలికాలం అయిపోగానే పెట్రోల్‌ డీజిల్ ధరలు తగ్గుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది కూడా ఇప్పట్లో లేదని పేర్కొంటున్నారు. తాజాగా బీమా రంగంలో ఎఫ్‌డీఐల ప్రవేశంపై తీసుకొచ్చిన కొత్త బిల్లు ప్రకారం మొత్తం 74 శాతం బీమా రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఈ బిల్లును ఆమోదం పొందితే బీమా రంగంలో కూడా ప్రైవేటు శక్తులు ఆధిపత్యం చలాయించనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular