fbpx
HomeTelanganaఒమిక్రాన్‌ తో ప్రాణభయం లేదన్న మంత్రి హరీశ్‌ రావు!

ఒమిక్రాన్‌ తో ప్రాణభయం లేదన్న మంత్రి హరీశ్‌ రావు!

OMICRON-DOES-NOT-KILL-PEOPLE-SAYS-HARISHRAO

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల‌ కలవరం మొదలయ్యింది. తెలంగాణ లో ఇప్పటికే రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికి రాష్ట్రంలో ఒమిక్రాన్‌ సోకినవారు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే అని తెలిసింది.

రాష్ట్రానికి వచ్చిన సోమాలియా, కెన్యా ప్రయాణీకులు ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ గుర్తించినట్లు అధికారులు పరీక్షల్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ.హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని, ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల ప్రాణభయం లేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అందరూ తప్పకుండా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, రాష్ట్రంలో ఇప్పటికే ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ 98 శాతం పూర్తి అయిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలందరూ మాస్కులు తప్పకుండా ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. తెలంగాణలో రెండు డోసుల వ్యాక్సినేషన్‌ 64 శాతం మందికి వేశామని తెలిపారు. బూస్టర్‌ డోసులను అందించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular