fbpx
HomeInternationalఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత నర్స్‌ మృతి

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత నర్స్‌ మృతి

NURSE-DIED-TAKING-PFIZER-VACCINE

పోర్చుగీసు : 100 శాతం సామార్థ్యం గల వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయాలంటే సాధారణంగా ఎంత లేదన్న రెండు మూడేళ్ల సమయం పడుతుంది. అయితే కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ విషయంలో ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను పక్కకు పెట్టి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ల వినియోగానికి అనుమతిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు. మన దేశంలో డీసీజీఐ భారత్‌ బయోటెక్‌ కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

కానీ వీటి సామార్థ్యం పట్ల ఇప్పటికే జనాల్లో చాలా అనుమానాలు మెదులుతుండగా, వీటిని మరింత పెంచే సంఘటన ఒకటి పోర్చుగల్‌లో చోటు చేసుకుంది. ఓ నర్స్‌ ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజుల తర్వాత చనిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాక వ్యాక్సిన్‌ పనితీరు పట్ల ఎన్నో అనుమానాలను, భయాలను పెంచుతుంది.

సోనియా అసేవెడో(41) అనే ఒక మహిళ పోర్టోలోని పోర్చుగీసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీలో పిడియాట్రిక్‌ అసిస్టెంట్‌ నర్స్‌గా పని చేస్తున్నారు. ఫైజర్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మృత్యువాత పడ్డారు.

సోనియా తండ్రి అబిలియో అసేవెడో ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘నా కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. రెండు రోజుల క్రితం తను కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకుంది. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇక వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా తను మరణించింది. నా కుమార్తె ఎందువల్ల మరణించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular