fbpx
HomeAndhra Pradeshఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి అపార అవకాశాలు

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి అపార అవకాశాలు

MORE-INDUSTRIAL-OPPORTUNITIES-IN-AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి అన్నారు. ఏపీలో డిసెంబర్ 2023 నాటికల్లా రామాయంపాడు పోర్టు అందుబాటులోకి వస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సు మంగళవారం జరిగింది. ఈ నేపథ్యంలో మేకపాటి మాట్లాడుతూ, ఆంధ్రలో తూర్పు తీర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. 2030 నాటికి దేశం మొత్తం ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను 10 శాతానికి చేర్చడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించారు.

కాగా తీర ప్రాంతాలలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న తీర ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి విస్తరణకు అవకాశం తక్కువని వివరించారు. కేంద్రం కొత్తగా మారిటైమ్ పాలసీ-2030ను తీసుకుని వచ్చిందని, మారిటైమ్ నావిగేషన్‌, మానిటరింగ్ యాప్‌ను కేంద్రం ఆవిష్కరించిందని పేర్కొన్నారు.

ఏపీలోని రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో రావాణ సామర్థ్యం పెంచనున్నామని ఆయన తెలిపారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక నగరాలు, పరిశ్రమలు పెరగనున్నాయని, లైట్ హౌసుల చుట్టూ పర్యాటక అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారని మంత్రి మేకపాటి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular