fbpx
Tuesday, April 23, 2024
HomeAndhra Pradeshసొంతూరుకి వెళ్ళడానికి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు దొంగతనం

సొంతూరుకి వెళ్ళడానికి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు దొంగతనం

  • అనంతపూర్ జిల్లాలోని ధర్మవరం పట్టణంలో జరింగింది ఈ సంఘటన
  • నిందితుడు, 33 ఏళ్ల ముజమ్మిల్ ఖాన్

ధర్మవరం : కర్ణాటక కి చెందిన ఒక వ్యక్తి అనంతపూర్ జిల్లాలోని ధర్మవరం బస్ డిపో నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కు చెందిన బస్సును దొంగిలించగలిగాడు. శుక్రవారం భోజన విరామ సమయంలో డ్రైవర్లు, కండక్టర్లు విరామం తీసుకుంటున్న సమయంలో జరిగింధీ సంఘటన. నిందితుడు కర్ణాటకలోని దేవనహళ్లి జిల్లాలోని విజయపురానికి చెందిన ముజమ్మిల్ ఖాన్ గా గుర్తించారు.

ధర్మవరం టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కరుణకర్ మాట్లాడుతూ, “నిందితుడు ఒక లారీలో గేదెలను తీసుకొని అనంతపూర్ కి వచ్చాడు. అక్కడ జంతువులను దించిన తరువాత, అతను మరియు క్లీనర్ మద్యం సేవించారు. కొంత మాటల ఘర్షణ జరిగిన తరువాత ముజమ్మిల్ లారీ నుంచి దిగి బస్సు ఎక్కి ధర్మవరం చేరుకున్నాడు. నిందితుడు మళ్ళీ మద్యం సేవించి, ధర్మవరం డిపోకు వెళ్లాడు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో, అతను బస్సు(AP 02Z 0552) నడుపుకుంటూ బెంగళూరు వైపు వెళ్ళడం ప్రారంభించాడు” అని సబ్ ఇన్స్పెక్టర్ చెప్పారు.

ఆర్టీసీ డిపో అధికారులు వెంటనే అప్రమత్తం అయి 100 కి ఫోన్ చేశారు. పోలీసులు వెంటనే బస్సును ట్రాక్ చేసి తక్కువ సమయం లోనే పట్టుకున్నారు. పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు ప్రస్తుతం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular