fbpx
Sunday, September 24, 2023

INDIA COVID-19 Statistics

44,998,463
Confirmed Cases
Updated on September 24, 2023 2:26 pm
531,930
Deaths
Updated on September 24, 2023 2:26 pm
567
ACTIVE CASES
Updated on September 24, 2023 2:26 pm
44,465,966
Recovered
Updated on September 24, 2023 2:26 pm
HomeBusinessప్రపంచంలోకి ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలి: నరేంద్ర మోడీ

ప్రపంచంలోకి ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలి: నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: కోవిడ్-19 లాక్‌డౌన్ ను క్రమంగా ఎత్తివేసేందుకు మరియు ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి దేశం ‘అన్‌లాక్ -1’ దశలోకి అడుగుపెడుతున్నందున భారతదేశం ఆర్థిక వృద్ధిని తిరిగి పొందే మార్గంలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు.

భారతదేశం యొక్క సంక్షోభ నిర్వహణ సామర్ధ్యంపై, దేశంలోని రైతులు, పారిశ్రామికవేత్తలు మరియు అనేక మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME) ల ప్రతిభపై తనకు అపారమైన నమ్మకం ఉందని ప్రధాని అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) 125 వ వార్షికోత్సవ ప్రారంభోపన్యాసంలో “మన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతాము” అని ప్రధాని అన్నారు. దేశంలో అన్లాక్-1 ప్రకటించిన తరువాత భారత ఆర్థిక వ్యవస్థపై ప్రధానమంత్రి చేసిన మొదటి ప్రధాన ప్రసంగం ఇది.

ప్రధాని ప్రస్తావించిన అంశాలు:

  1. ఆన్‌లైన్ కార్యకలాపాలు కోవిడ్-19 యుగంలో సాధారణమైనవిగ ప్రధాని అభిప్రాయడ్డారు.
  2. దేశానికి ఇప్పుడు ‘మేడ్ ఇన్ ఇండియా’, కానీ ‘మేడ్ ఫర్ ది వరల్డ్’ ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు.
  3. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా వ్యాపిస్తుండగా, భారతదేశం సకాలంలో చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
  4. ఇతర దేశాలతో పోల్చినప్పుడు, భారతదేశంలో లాక్డౌన్ చర్యలను విధించడం వలన లోతైన ఫలితాలను గ్రహించగలమని ఆయన పేర్కొన్నారు.
  5. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యతలలో ఒకటి అని ప్రధాని మోదీ అన్నారు.
  6. ప్రపంచం నమ్మకమైన భాగస్వామి కోసం చూస్తోంది. భారతదేశంలో మనకు సామర్థ్యం మరియు బలం రెండు ఉన్నాయని పేర్కొన్నారు.
  7. దేశాన్ని వేగంగా అభివృద్ధి మరియు వృద్ధి మరియు స్వావలంబన మార్గంలో నడిపించడానికి ఐదు విషయాలు చాలా ముఖ్యమైనవి – ఉద్దేశం, చేరిక, పెట్టుబడి, మౌలిక సదుపాయాలు మరియు ఆవిష్కరణలు అని మోడీ పేర్కొన్నారు.
  8. ఇప్పుడు, గ్లోబల్ సప్లై చైన్లో భారతదేశం యొక్క వాటాను బలపరిచే బలమైన స్థానిక సరఫరా గొలుసును రూపొందించడానికి మనము పెట్టుబడి పెట్టాలి. ఈ విషయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) వంటి పెద్ద సంస్థ కూడా కరోనా అనంతరం కొత్త పాత్రలో ముందుకు రావలసి ఉంటుంది.
  9. “ఈ రోజు ప్రభుత్వం ఏ దిశలో పయనిస్తుందో, అది మన మైనింగ్ రంగం, ఇంధన రంగం లేదా పరిశోధన మరియు సాంకేతిక పరిజ్ఞానం అయినా, ప్రతి రంగంలోనూ దేశంలోని యువతకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి” అని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular