మూవీడెస్క్: సెప్టెబర్ 24వ తేదీన విడుదలైన సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్స్టోరి’ మూవీ రికార్డ్ కలెక్షన్స్తో ముందుకెళ్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మువీ కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమాగా నిలవనుంది. కరోనా భయంతో సినిమా హాళ్ళకు ప్రేక్షకులు వస్తారో రారో అన్న అనుమానాల మధ్య సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ విడుదల అయిన మొదటి రోజే రికార్డు స్థాయిలో వసూళ్ళు చేసింది.
ఈ మూవీ ఇప్పుడు మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. అమెరికాలో విడుదలైన ఈ చిత్రం విడుదలైన కేవలం 3 రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల (రూ.7 కోట్ల 37 లక్షలు) వసూళ్లను వసూలు చేసింది. ఆదివారం రాత్రి వరకు 2021లో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా లవ్స్టోరీ నిలిచింది.
కాగా ఒక తెలుగు సినిమా మూడు రోజుల్లోనే యూఎస్లో 1 మిలియన్ల డాలర్లోకి వెళ్లడం ఇది ప్రథమం. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రికార్డుల స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా కూడా ఈ లవ్స్టోరీ చిత్రం నిలిచింది. దీంతో లవ్స్టోరీ 2 మిలియన్ల డాలర్ల మైల్స్టోన్ దిశగా వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
చిత్ర సీమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొదటి రోజు లవ్స్టోరీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లను వసూళ్లు చేసింది. ఒక యూఎస్లోనే 2.9 కోట్ల కలెక్షన్లను రాబట్టి, సెంకడ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపెనింగ్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా లవ్స్టోరి నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటుఇటుగా రూ. 6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.