fbpx
Saturday, July 27, 2024
HomeTelanganaలాక్‌డౌన్‌ ఉండదని స్పష్టం చేసిన కేసీఆర్

లాక్‌డౌన్‌ ఉండదని స్పష్టం చేసిన కేసీఆర్

KCR-SAYS-NO-LOCKDOWN-IN-TELANGANA

హైదరాబాద్‌: మన దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన విశ్వరూప్రం చూపిస్తూ విజృంభిస్తోంది. కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా ప్రదేశల్లో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అదే విధంగా తెలంగాణలో కూడా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసి వేయడం జరుగుతుంది.

ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మరో సారి లాక్‌డౌన్‌ విధిస్తారనే ఊహాగానాలు ఎక్కుబగా వినిపిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఈ రోజు పూర్తి స్పష్టత ఇచ్చారు. తెలంగాణ లో ఇంకో సారి లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని తేల్చేశారు. ద్రవ్యవినిమయ బిల్లుపై ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు.

అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలోను సంక్షేమం ఎక్కడా ఆగలేదు. రాష్ట్రంలో అప్పులు కూడా పెరగలేదు. కాగా ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం లేదన్నారు. ప్రతి దాన్ని విమర్శించడమే వారి ప్రధాన అజెండా. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. రిజర్వేషన్లు రాష్ట్రాలకే వదిలేయాలని కోరాం. త్వరలో 57ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్‌ ఇస్తాం’’ అన్నారు.

రాష్ట్రంలో స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉంది కాబట్టే మూసివేశాం. ఇది తాత్కాలికమే. నిన్న ఒక్కరోజే 70వేల కరోనా పరీక్షలు చేశాం. ఇప్పటి వరకు 10లక్షల మందికి పైగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ ఇ‍చ్చాం. గతేడాది లాక్‌డౌన్‌తో ఆర్ధికంగా నష్టపోయాం. ఇక మరోసారి తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలి. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. ఉస్మానియా ఆ‍స్పత్రిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. తాగునీటి సమస్యకు చెక్‌ పెట్టాం’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular