fbpx
HomeTelanganaగ్రేటర్ పోరులో జనసేన బీజేపీతో జట్టు

గ్రేటర్ పోరులో జనసేన బీజేపీతో జట్టు

JSP-BJP-ALLIANCE-FOR-GHMC-ELECTIONS

హైదరాబాద్‌ :‌ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రత్యక్ష రాజకీయ రణరంగంలోకి దిగాయి. ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేస్తూ గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, ప్రతి పక్షాలు కాం‍గ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం ప్రధాన పార్టీలుగా బరిలో నిలవగా, పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ కాస్త ఆలస్యంగా రంగంలోకి దిగింది. గ్రేటర్‌ ఎన్నికల్లో తాము కూడా పోటీ చేస్తున్నట్లు పవన్‌ ఇటీవల ప్రకటించారు. అయితే బీజేపీ- జనసేన మధ్య మధ్య పొత్తు మాత్రం ఉండదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

కాగా వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని జనసేన వ్యూహాత్మకంగా వడివడి అడుగులు వేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు గురువారం బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌తో పవన్‌ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జనసేన తన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపింది.

గ్రేటర్‌లో పొత్తు గురించి ఇరువురు నేతలు ఈ భేటీ లో చర్చించనున్నారు. దీనిపై ఇరు పార్టీల నేతల భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే జనసేనతో పొత్తుపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడూ ఆసక్తికరంగా మారింది.

పవన్‌ కల్యాణ్‌తో బండి సంజయ్‌ భేటీ ఉంటుందని జనసేన ప్రకటన బీజేపీ నేతలను షాకింగ్‌కు గురిచేసింది. తమకు తెలియకుండానే పవన్‌ మీడియాకు లీకులిస్తున్నారని ఆ పార్టీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ తీరుపై బీజేపీ నేతల అసంతృప్తిగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular