fbpx
Saturday, July 27, 2024
HomeTelanganaనాగార్జునసాగర్ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ నుండి జానారెడ్డి

నాగార్జునసాగర్ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ నుండి జానారెడ్డి

JANAREDDY-CONTESTING-SAGAR-BYPOLL-FROM-CONGRESS

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతన అధ్యక్షుడి ఎంపిక విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్‌ అధిష్టానం కాస్త విరామం‌ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల విజ్ఞప్తి మేరకు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పూర్తయ్యేదాకా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, గురువారం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. సాగర్‌ ఉప ఎన్నికల్లో బరిలో జానారెడ్డి దిగుతున్నట్లు ప్రకటించారు. జానారెడ్డి మొదట్లో సంకోచించినా, పలు సంప్రదింపుల తర్వాత బరిలో దిగేందుకు అంగీకరించారని మాణిక్యం ఠాగూర్‌ తెలిపారు.

అలాగే టీపీసీసీ అధ్యక్షుడిని ప్రకటించాలనే నిర్ణయాన్ని కూడా వాయిదా వేయాలన్న సీనియర్‌ నేత జానారెడ్డి విజ్ఞప్తిని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదించారని, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ నూతన అధ్యక్షుడితో పాటు పూర్తి కార్యవర్గం ప్రకటిస్తామని ఆయన ఈ సందర్భంగా‌ పేర్కొన్నారు.

పార్టీలోని నాయకులతో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీసీసీ ప్రకటనను వాయిదా వేయాలన్న జానారెడ్డి అభిప్రాయంతో దాదాపు అందరూ ఏకీభవించారన్నారు. రాష్ట్ర నాయకుల అభిప్రాయాన్ని అధినేత్రి దృష్టికి తీసుకెళ్ళగా ఆమె దానికి అంగీకరించారని తెలిపారు. సాగర్‌ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని ఠాగూర్‌ స్పష్టత ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular