fbpx
HomeNationalఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చుక్కలే!

ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చుక్కలే!

INSURANCE-PREMIUM-INCREASES-VIOLATING-TRAFFIC-RULES

న్యూఢిల్లీ: కొత్త ట్రాఫిక్ రూల్స్ ఎన్ని తీసుకొచ్చిన మన దేశంలో చాలా మటుకు వాహనదారులు ఆ రూల్స్ ను ఏమాత్రం పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంటారు. ఇలాంటి వారి వలన ఇతర వాహనదారులు చాలా సమయాల్లో ఇబ్బందికి గురి అవుతుంటారు. అయితే ఇలా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారు ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.

భీమా రెగ్యులేటర్ అయిన ఐఆర్‌డిఎఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకురాబోతుంది. ట్రాఫిక్‌కు, ఇన్సూరెన్స్‌కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇక్కడే అసలైన కిటుకు ఒకటి ఉంది. ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను తరుచూ ఉల్లంఘిస్తారో, వారి వాహనం యొక్క భీమా ప్రీమియం రేటు కూడా అమాంతం పెరిగిపోతుంది. ఈ కొత్త రూల్ వల్ల మీరు ట్రాఫిక్ చలనాతో పాటు మీ వెహికల్ భీమా ప్రీమియాన్ని అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పాటికే దీనికి సంబందించిన ఒక నివేదికను కూడా ఐఆర్‌డిఎఐ సిద్ధం చేసింది. తొలిసారిగా ఈ కొత్త నిబంధనలు దేశ రాజధాని ఢిల్లీలో అమలులోకి తీసుకురావడానికి యత్నిస్తోంది. తర్వాత దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారు. వాహన భీమా ప్రీమియం సమయంలో గత రెండేళ్ల నాటి ట్రాఫిక్ చలానాలను పరిగణలోకి తీసుకొని మీకు ప్రీమియం నిర్ణయిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular