fbpx
Saturday, May 4, 2024
HomeNationalటీ20 సిరీస్ కూడా క్లిన్ స్వీప్ చేసిన భారత్!

టీ20 సిరీస్ కూడా క్లిన్ స్వీప్ చేసిన భారత్!

INDIA-WIN-T20-SERIES-AGAINST-WESTINDIES

కోల్కత్తా: ఆదివారం కోల్‌కతాలో జరిగిన మూడవ మరియు చివరి టీ20ఐలో భారత్ వెస్టిండీస్‌పై 17 పరుగుల తేడాతో నెగ్గి టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.

దీని ముందు జరిగిన వన్డే సిరీస్ ను కూడా భారత్ 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ తొలి బ్యాటింగ్ చేసి 184 పరుగులు 5 వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ కు 185 పరుగుల టార్గెట్ ను విధించింది.

భారత్ బౌలింగ్ లో హర్షల్ పటేల్ (3/22), వెంకటేష్ అయ్యర్ (2.1 ఓవర్లలో 2/23), శార్దూల్ ఠాకూర్ (2/33) తమ పదునైన బౌలింగ్ తో భారత విజయానికి బాటలు వేశారు.

వెస్టిండీస్ బ్యాటర్ మరియు వికెట్ కీపర్ నికోలస్ పూరన్ తన చక్కటి ఫామ్‌ను కొనసాగించి వరుసగా మూడో అర్ధ సెంచరీ (47 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) సాధించాడు, అయినప్పటికీ వెస్టిండీస్ తొమ్మిది వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేయగలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular