fbpx
HomeNationalఇక ఏకే-47 తయారీ భారత్ లోనే!

ఇక ఏకే-47 తయారీ భారత్ లోనే!

INDIA-TO-MANUFACTURE-AK-47

మాస్కో: ఇండియా, రష్యాల మధ్య కీలక ఒప్పందం దృష్ట్యా భారత్‌లోనే ఏకే– 47 203 రైఫిల్స్‌ ఉత్పత్తికి బీజం పడింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తాజా రష్యా పర్యటనలో ఈ డీల్‌ ఒక కొలిక్కి వచ్చినట్లు రష్యా మీడియా పేర్కొంది. ఇండో రష్యా రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జేవీలో భాగంగా వీటిని ఉత్పత్తి చేయనున్నారు.

కల్నోషికోవ్‌ కన్సెర్న్, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌లు ఈ జాయింట్‌ వెంచర్‌(జేవీ)లో భాగస్వాములు. జేవీలో ఆర్డినెన్స్‌ఫ్యాక్టరీ బోర్డుకు మెజార్టీ (50.5 శాతం)వాటా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కొర్వా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో ఈ ఏకే– 47లను ఉత్పత్తి చేయనున్నారని మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఏకే– 47 రైఫిల్స్‌లో 203 మోడల్‌ ఆధునికమైన వెర్షన్‌. ప్రస్తుతం ఆర్మీ వాడుతున్న ఇన్‌సాస్‌ 5.56 ్ఠ45 ఎంఎం అసాల్ట్‌ రైఫిల్‌ స్థానంలో ఈ ఏకే– 47 –203 రైఫిల్స్‌ను ప్రవేశపెడతారు. భారత ఆర్మీకి దాదాపు 7.7 లక్షల ఏకే– 47 203లు అవసరం పడతాయని అంచనా. లక్ష రైఫిల్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతావి దేశీయంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది.

ఒక్కోరైఫిల్‌ ఖరీదు దాదాపు 1100 యూఎస్‌ డాలర్లు ఉండవచ్చు. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇన్సాస్‌ రైఫిళ్లను 1996 నుంచి వినియోగిస్తున్నారు. ఇన్సాస్‌ రైఫిళ్లతో హిమాలయ మంచు ప్రాంతాల్లో జామ్‌ కావడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆర్మీకి ఏకే– 47 203 మోడల్‌ రైఫిళ్లను అందించాలని నిర్ణయించారు.

రష్యా రక్షణ మంత్రి జనరల్‌ సెర్గీతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ప్రకటించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారం సహా పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్‌ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు, మందుగుండు, విడిభాగాలను భారత్‌కు సరఫరా చేసే అంశంపై రష్యాతో ఆయన చర్చలు జరిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular