fbpx
HomeAndhra Pradeshఏపీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు శుభవార్త!

ఏపీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు శుభవార్త!

GOODNEWS-FOR-CONTRACT-EMPLOYEES-IN-AP

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పని చేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమమ్‌ పే స్కేల్‌ వర్తింపజేయాలని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరికీ మినిమం పేస్కేల్‌ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది.

కాగా ఈ జాబితాలో కన్సల్టెంట్లు, సలహాదారులు మరియు ఓఎస్డీలకు పే స్కేల్‌ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు మహిళా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ (ఇద్దరి సంతానం వరకు మాత్రమే) సెలవు కూడా‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇక వీటితో పాటు ఏదైనా ప్రమాదంలో కాంట్రాక్ట్ ఉద్యోగి మరణిస్తే సదరు కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఒకవేళ సహజంగా మరణిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.365 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు అంచనా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular