fbpx
HomeTelanganaనిదానంగా సాగుతున్న జీహెచ్ఎంసీ పోలింగ్

నిదానంగా సాగుతున్న జీహెచ్ఎంసీ పోలింగ్

GHMC-ELECTIONS-STARTED-WITH-LOW-PERCENTAGE

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌ శాతం పెంపుపై తీవ్రంగా కృషి చేసిన అధికారులకు నిరాశే ఎదురవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్‌ను గణనీయంగా పెంచాలని గ్రేటర్‌ అధికారులు బాగా కసరత్తు చేశారు.

అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ తాజా ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారాన్ని చేపట్టాయి. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు మన హక్కు, తప్పనిసరిగా అందరూ ఓటు వేయండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా నగర ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశారు.

ఇంత చేసినా ఓటింగ్‌ శాతంగా మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఈ సందర్భంగా సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ పోలింగ్‌ సరళిపై ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంతో కలసి ఓటు వేసి వచ్చిన ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ‘‘మేమంతా..ఓటు వేశాం.. మీరూ వేయండి! ఇది మన బాధ్యత… హక్కు!!’’ అంటూ ట్వీట్‌ చేశారు.

డైరెక్టర్‌ తేజ, టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, హీరో విజయ్‌ దేవరకొండ కుటుంబం తదితరులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ చాలా ప్రాంతాల్లో మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే పోలింగ్ మొదలై దాదాపు మూడు గంటలు గడుస్తున్నా చాలా చోట్ల పోలింగ్‌ శాతం 3 శాతానికి మించలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

జీహెచ్‌ఎంసీలో మొదటిరెండు గంటల్లో 3.1 శాతం మాత్రమే వోటింగ్‌ నమోదు కాగా తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 8.9 శాతం పోలింగ్‌ నమోదైంది. ఒకవైపు చలి తీవ్రత, కోవిడ్‌-19 ఆందోళన ఓటింగ్ శాతం పై తీవ్ర ప్రభావితం చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఇపుడిపుడే కొన్ని చోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఓట్లరు బారులు తీరుతున్నారని స​మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular