fbpx
Friday, April 26, 2024
HomeAndhra Pradeshనలుగురు పోలీసులు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి!

నలుగురు పోలీసులు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి!

FOUR-POLICE-DIED-IN-SRIKAKULAM-ROAD-ACCIDENT

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక పోలీస్‌ వాహనం యొక్క టైర్‌ పేలడంతో అది బోల్తా పడింది. కాగా జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మరణించారు. ఈ రోజు పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

అయితే విషాదం ఎంటంటే కలకత్తాలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని తమ కుటుంబ సభ్యులకు అప్పగించి తిరిగి వస్తుండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డీజీపీ గౌతం సవాంగ్, ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన ఏఆర్‌ పోలీసుల దుర్మరణం పట్ల రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular