fbpx
HomeTelanganaకరోనా వ్యాక్సిన్‌ పై వెనక్కితగ్గిన ఈటల రాజేందర్

కరోనా వ్యాక్సిన్‌ పై వెనక్కితగ్గిన ఈటల రాజేందర్

ETELA-RAJENDAR-STARTS-VACCINATION-IN-TELANGANA

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పంపిణీ చేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. ఇవాళ భారత్‌లోనూ ఈ టీకా పంపిణీ మొదలు అయ్యింది. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో శనివారం ఉదయం ప్రారంభించారు. దేశం మొత్తం మీద ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది.

ఈ సందర్భంగా దేశంలోనే తొలి టీకాను ఢిల్లీ ఎయిమ్స్‌లోని శానిటైజర్‌ కార్మికుడు మనీష్‌ కుమార్‌కు వేయగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ టీకా ప్రక్రియ ఆరంభమైంది. అయితే రాష్ట్రంలో మొదటి టీకాను తానే వేసుకుంటానని ముందే ప్రకటించిన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.

ఈ రోజు గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ ప్రక్రియను ఆరంభించినప్పటికీ తొలి టీకాను తాను వేయించుకోలేదు. కరోనా తొలి టీకాను పారిశుధ్య కార్మికులు, హెల్త్‌ వర్కర్స్‌కు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను జారీచేసింది. దీనిలో భాగంగానే గాంధీ ఆస్పత్రిలో హెల్త్ వర్కర్‌ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు.

వ్యాక్సినేషన్ మంత్రులకు, ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ నాయకులు తొలి విడతలోనే వేయించుకుంటే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని కేంద్ర పెద్దలు అభిప్రాయపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన ఈటల, తొలి వ్యాక్సిన్‌ వేసుకునే విషయంలో ముందుకు రాలేదు. అయితే కోవిడ్‌ నియంత్రణకు రూపొందించిన టీకాపై ప్రజల్లో ఆందోళనలు తొలగించేందుకు తాను వ్యాక్సిన్‌ వేసుకుంటానని చెప్పినట్లు ఆయన వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular