fbpx
HomeLife Styleదేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఎలెక్ట్రిక్ స్కూటర్లు

దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఎలెక్ట్రిక్ స్కూటర్లు

ELECTRIC-BIKES-DEMAND-RISE-IN-INDIA

న్యూఢిల్లీ: ప్రజలకు ఎల‌క్ట్రిక్ వాహానాల మీద రోజు రోజుకి దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న చమురు ధ‌ర‌లు కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. దేశంలో ఇప్ప‌టికే చాలా వరకు ఎల‌క్ట్రిక్ వాహనాలు తయారు చేసే కంపెనీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ సామాన్యులకు అందనంత ఎత్తులోనే ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలు అన్నీ దాదాపుగా వేగం తక్కువగా ఉండడం లేదంటే ధర ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య ప్రజలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ముందడుగు వేయలేకున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా ఎల‌క్ట్రిక్ స్కూటర్లను హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ ప్యూర్ ఈవీ తయారు చేస్తోంది‌. ప్యూర్ ఈవీ అనే సంస్థ హై స్పీడ్ మోటార్ స్కూటర్లను అందుబాటు ధరలో తయారు చేస్తుంది.

ఈ సంస్థకు చెందిన “ఇప్లూటో 7 జీ” అనే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 116 కీలోమీట‌ర్ల వ‌ర‌కు దీనిపై ప్ర‌యాణం చేయోచ్చ‌ని సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. దీని మరో ప్రత్యేకత ఏమిటంటే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రూ.17 విలువ చేసే ప‌వ‌ర్ ఖ‌ర్చు కానున్నట్లు సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. అంటే కేవ‌లం 17 రూపాయిల‌తోనే సుమారు 116 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయవచ్చు‌.

అంతే కాకుండా దీని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ స్కూటర్ కేవ‌లం 5 సెక‌న్లు లోనే దాదాపు 40 కీలోమీట‌ర్ల స్పీడ్ ను అందుకోగలదు. ఇప్లూటో 7 జీ గరిష్ట వేగం 60 కిలోమీట‌ర్లు. ఇది 2.5 కేడ్ల్యూహెచ్ లిథియోమ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిని ఫుల్ చార్జ్ చేయ‌డానికి నాలుగు గంట‌ల సమయం ప‌డుతుంది. ఇప్లూటో 7 జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.83,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఐదేళ్ల వారంటీతో పాటు వ‌చ్చే ఈ బైక్ తీసుకోవ‌డానికి ప‌లు బ్యాంక్ లు లోన్ కూడా అందిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular